నవతెలంగాణ – బిచ్కుంద
ఇటీవల గెలుపొందిన సర్పంచులకు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు సవాలుగా మారాయి. వర్షాల వల్ల మురికి కాలువల్లో చెత్త పేరుకుపోవడం దోమలు వ్యప్తి చెంది గ్రామ ప్రజలు ఇబ్బంది పడడం ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం గెలుపొందిన సర్పంచులు చొరవ తీసుకొని పేరుకుపోయిన చెత్తను మట్టిని తొలగింప చేస్తున్నారు. ఆదివారం బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో సర్పంచ్ సంతోష్ పటేల్ కార్మికులను ఏర్పాటు చేసి గ్రామంలోని మురికి కాలువలు శుభ్రం చేయించి గ్రామ వీధులలో మురికి నీరు నిలవకుండా ప్రధాన కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని కార్మికులతో శుభ్రం చేయించారు. సర్పంచ్ సంతోష్ పటేల్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని గ్రామంలో వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా, మురికి కాలువలు శుభ్రం చేయించడం ప్రజలకు ఇబ్బంది కలవకుండా చూడడం గ్రామ పంచాయతీ పాలకుల బాధ్యత అని అన్నారు. ఆయన వెంట శ్రీనివాస్ ఉన్నారు.
పుల్కల్ లో మురికి కాలువల శుభ్రం చేయించిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



