- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో సోమవారం నాడు క్రికెట్ టోర్నమెంట్ను గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శరీరకంగా ఎంతో ఉపయోగపడతాయని క్రీడలతో యువకుల కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని ఆయన తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలకమండలి చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధర సాయిలు, మాజీ ఎంపీటీసీ సభ్యులు కర్రే వార్ రాములు, సంగీత కుశాల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బండి గోపి, గ్రామ పెద్దలు యువకులు, క్రికెట్ టోన్మెంట్ క్రీడాకారులు పాల్గొన్నారు.
- Advertisement -



