- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం ఖమ్మం(D) కల్లూరు(M)నారాయణపురం గ్రామ సర్పంచ్ ఏకగ్రీవమైంది. గ్రామాభివృద్ధి కోసం సమష్టిగా చర్చించుకుని సర్పంచి, వార్డులను ఏకగ్రీవం చేసుకున్నట్లు మంత్రి సోదరుడు, కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి ప్రసాదరెడ్డి తెలిపారు. సర్పంచి అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వరరావును ప్రసాదొడ్డి శాలువాతో సత్కరించి మాట్లాడారు. గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం, పీహెచ్సీకి స్థలం ఇస్తామని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ప్రసాదరెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -



