- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోగల ఒకటవ వార్డులో గత కొన్నేళ్లుగా తాగునీటి సమస్యను వార్డు ప్రజలు పలుమార్లు గత పాలకులకు, సంబంధించిన అధికారులకు విన్నవించిన పట్టిల్చుకోలేదు. ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉండడంతో ప్రస్తుత సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ దృష్టికి వార్డు ప్రజలు తీసుకరావడంతో వేంటనే స్పందించిన సర్పంచ్, ఉప సర్పంచ్ లు శనివారం సమస్యను జీపీ సిబ్బందితో పైప్ లైన్ మరమ్మతులు చేయించారు. తాగునీటి సమస్యను పరిష్కారం చేశారు. ఇందుకు వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



