- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద శక్కర్గ గ్రామపంచాయతీ పరిధిలోని 8, 9, వార్డుల పరిధిలో నీటి ఎద్దడి నివారణ చర్యలను గ్రామ సర్పంచ్ విశాలాక్షి రాంపటేల్ చేపట్టారు. ఆ రెండు వార్డుల్లో నీటి ఎద్దడి కోసం కొత్తగా బోరు మోటర్ ట్యాంకర్ ద్వారా గల్లి వాసులకు సరఫరా ప్రారంభించారు. గ్రామంలో ఎక్కడ కూడా నీతి ఎద్దడి ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ విశాలాక్షి రాం పటేల్ తెలిపారు. నీటి సరఫరా ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లక్ష్మణ్ ఆయా వార్డుల సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



