- Advertisement -
నవతెలంగాణ-రామగిరి
రామగిరి మండలం రాజాపూర్ గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి భర్త, కొమురయ్య హెల్పర్గా మారిన వైనం. గ్రామంలో విద్యుత్ స్తంభాలకు లైట్లు లేకపోవడంతో అందుబాటులో హెల్పర్ లేకపోవడంతో తానే స్వయంగా హెల్పర్ గా మారి గ్రామ ఉపసర్పంచ్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్ వార్డు సభ్యులు కన్నూరి శశి కుమార్, తోపాటు కన్నూరి పర్వతాలు, శ్రవణ్ కుమార్ ల సహకారంతో విద్యుత్ దీపాలను పెట్టడం జరిగింది. ప్రజల సేవ కోసం తాను పనిచేసి చూపిస్తానని కొమురయ్య అన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని సూచించారు.
- Advertisement -



