నవతెలంగాణ – నెల్లికుదురు
మునిగల వీడు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇసంపల్లి పెర్మయ్య మృతి గ్రామానికి తీరనిలోటు అని మదనతుర్తి సర్పంచ్ బిర్రు రాధా యాకన్న, మునిగలవీడు సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు అన్నారు. ఆదివారం పార్దవ దేహానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం నింపి పాడే మోసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈసంపల్లి పెర్మయ్య గ్రామ అభివృద్ధి లోను సంఘం అభివృద్ధిలోనూ ముందడుగు వేసే వ్యక్తి అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆయన మృతి చెందడం ఎంతో బాధాకరమని తెలిపారు. మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకునేందుకు మా వంతు సహకారం అందిస్తామని అన్నారు. మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నాయకులు మల్లెపాక ప్రశాంత్ , ఐత మురళి, ఇసం పెళ్లి ఉపేందర్, పాల్గొనడం జరిగింది.



