నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ గగనతలం, భూభాగం మీదగా ఎలాంటి మిలటరీ దాడులకు పాల్పడ్డకుండా నిషేధం విధించింది. సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) ఒక ప్రకటన ప్రకారం, క్రౌన్ ప్రిన్స్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో టెలిఫోన్ సంభాషణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
సౌదీ అరేబియా.. ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తుంది, ఏ పార్టీ నుండి అయినా, వారి మూలంతో సంబంధం లేకుండా, దేశంపై దాడులు లేదా సైనిక కార్యకలాపాలను అనుమతించదు. ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించడానికి రాజ్యం మద్దతును కూడా ఆయన పునరుద్ఘాటించారు.
ఇరాన్ అధ్యక్షుడు సౌదీ అరేబియా నిర్ణయం హర్షం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన కృషికి క్రౌన్ ప్రిన్స్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇరాన్ పై దాడులు చేయడానికి ట్రంప్ ముమ్మరం పావులుకదుపుతున్నారు.అయతే సౌదీ నిర్ణయంతో యూఎస్ ఇరకాటంలో పడింది.



