నవతెలంగాణ – మద్నూర్
ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి 84 వ స్నాతకొత్సవంలో ఇస్రో చైర్మన్ డాక్టర్. వి.నారాయణ చేతుల మీదుగా పీహెచ్డీ డాక్టరేట్ పట్టా అందుకున్న సుర్నార్ బాలాజీ పాకిల్ కి మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. పి హెచ్ డి డాక్టరేట్ పట్టా సాధించడానికి ఆయన పడ్డ కష్టాలను మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. టి హెచ్ డి పట్టా సాధించడం మండలానికి వన్నె తీసుక వచ్చారని ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ వివరిస్తూ బాలాజీ పాటిల్ తండ్రి అంగత్ రావు రావు పాటిల్ సమకాలిన ఉపన్యాసాలలో మానవీయ విలువలు అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అప్సర్ ఉన్నిసా బేగం పర్యవేక్షణలో హిందీ విభాగంలో దాదాపు 5 సంవత్సరాలు పరిశోధనలు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. చదువుకోవాలని సంకల్పం ఉన్న ప్రతి విద్యార్థి కష్టాలను ఇష్టంగా మార్చుకొని ముందుకెళ్తాడని, నేను చిన్నప్పటినుంచి ఎంతో కష్టపడి చదివి ఈ డాక్టరేట్ పట్టాను తీసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ నా పీహెచ్డీ పట్టాను నన్ను కష్టపడి స్థాయికి తీసుకొచ్చిన మా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానని అన్నారు.
పీహెచ్డీ డాక్టరేట్ పట్టా సాధించిన బాలాజీని అభినందించిన సౌజన్య రమేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES