రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మండల తహసిల్దార్ కు గ్రామస్తుల విన్నపం..
నవతెలంగాణ – మద్నూర్ : భూభారతి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా సోమవారం మద్నూర్ మండలంలోని చిన్న తడుగూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మండల తహసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనకు గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాల భూమి సర్వే నంబర్ 26 లో 21 గుంటల భూమి ఉండేదని, పాఠశాల భూమి మొత్తం అక్రమ కబ్జాలకు గురైందని, పాఠశాల భూమిని కాపాడాలని వేడుకున్నారు. ఆ స్థలం 25 గుంటలు కొలతలతో బాండ్రి చూయించాలని, గ్రామస్తులు తాసిల్దారుకు విన్నవించారు. 26 సర్వే నెంబర్లు దాదాపు 39 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా వీటిలో 21 గుంటల భూమిని ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిందని, మిగతా భూమిని కుల జాతుల వారికి కేటాయించినదని తలిపారు. పాఠశాలకు గ్రౌండ్ లేకుండా, చుట్టుపక్కల కబ్జాలు చేసిన వాటిని తొలగించాలని కోరారు. పిల్లలకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండే విధంగా స్థలాన్ని కొలతల ద్వారా బాండ్రి వేయించాలని వారు తాసిల్దార్ కు విన్నవించారు. గ్రామంలోని అందరూ పాఠశాల కబ్జాను కాపాడటానికి ముందుకు వస్తే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కబ్జా నుంచి ప్రభుత్వ పాఠశాల భూమిని కాపాడండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES