Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సావిత్రిబాయి పూలెకు భారతరత్న ఇవ్వాలి..

సావిత్రిబాయి పూలెకు భారతరత్న ఇవ్వాలి..

- Advertisement -

జాతీయ బిసి సంఘం జిల్లా ఇంచార్జి సమ్మయ్
నవతెలంగాణ – మల్హర్ రావు

భారత దేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేకు భారతరత్న బిరుదు ఇవ్వాలీ జాతీయ బీసీ సంఘం భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి విజయగిరి సమ్మయ్య ప్రభుత్వానికి శనివారం ఒకప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గురుపూజోత్వము సందర్భంగా భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే భారతదేశంలోనే అందరికీ మహిళలకు విద్యను అందించిన ఘనత సావిత్రిబాయి పూలేకు మాత్రమే దక్కిందన్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలో పూణేలో విశ్రాంబాగ్ వాడలో కులమత భేదం లేకుండా అందరి మహిళలకు విద్యను అందించే, స్వంతంగా పాఠశాలలు ఏర్పాటు చేసి, బాలికలకు విద్యాబ్యాసాలు అందించారు. నేటి కేంద్ర ప్రభుత్వం వెంటనే సావిత్రి బాయి పూలేకు భారతరత్న బిరుదు ప్రకటించాలని ప్రభుత్వాన్ని బీసీ సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -