- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి, భిక్కనూర్, రామేశ్వర్ పల్లి ఆయా గ్రామాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరపల్లి సర్పంచ్ రాణి రాజు, ఉప సర్పంచ్ వినోద్ గౌడ్, వార్డు సభ్యులు, ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



