- Advertisement -
నవతెలంగాణ- దుబ్బాక
ఇటీవలే అనారోగ్యంతో మరణించిన అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని ఎనగుర్తి లో ర్యాకం మల్లయ్య, చిన్న నిజాంపేటలో కొండాపురం గుట్టయ్య కుటుంబ సభ్యులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయన వెంట దుబ్బాక పీఏసీఎస్ చైర్మన్ షేర్ల కైలాష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు జీడిపల్లి రవి, పంజాల శ్రీనివాస్, మహంకాళి, పర్శరాములు, స్వామిగౌడ్ పలువురు ఉన్నారు.
- Advertisement -