మండల కమిటీ ఎన్నిక
స్కావెంజర్ల మండల కమిటీ అధ్యక్షురాలు రమా
నవతెలంగాణ – తాడ్వాయి : ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రత పచ్చదనం నిర్వహించే స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలని, స్కావెంజర్ల నూతన మండల అధ్యక్షురాలు పోలుదాసరి రమ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షురాలుగా పోలదాసరి రమ, ఉపాధ్యక్షురాలు ఇరుప కవిత, ప్రధాన కార్యదర్శి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. పనికి తగ్గ వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్కావెంజర్లు పార్వతీ సుజాత శ్రీలత విజయ శ్రీలక్ష్మి అఖిల్ లావణ్య రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES