నవతెలంగాణ – భువనగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ ఫథకాలు ప్రజలకు వివరించే విధంగా కాంగ్రెస్ కార్యాకర్తలకు, ఎన్ఎస్యూఐ కార్యాకర్తలకు దిశ నిర్ధేశన చేయాలని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్కుమార్గౌడ్ నాయకులు సూచించారు. హైద్రాబాద్ నుంచి వరంగల్కు ఓ ప్రైవేట్ కార్యాక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ సమయంలో కలిసి పని చేసిన టీపీసీసీ ప్రతినిధులు పోత్నక్ ప్రమోద్కుమార్, రాచమల్ల రమేష్లు ఆయను మర్యాపుర్వకంగా కలిసారు. అనంతరం స్థానిక సంస్థలలో జిల్లాలో అవలంబిచే కార్యక్రమాలపై వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు, 42శాతం రిజర్వేషన్లు, రేషన్కార్డులు వాటిపై ప్రజలకు వివరించాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి సభ నేపథ్యంలో పలు సూచనలు చేశారు.
పథకాలు ప్రజలకు వివరించాలి: టీపీసీసీ చీఫ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES