Wednesday, June 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్కూల్ భవన నిర్మాణం శంకుస్థాపన శిలాఫలకం ధ్వంసం

స్కూల్ భవన నిర్మాణం శంకుస్థాపన శిలాఫలకం ధ్వంసం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ : జుక్కల్ నియోజకవర్గం విద్య హబ్బుగా మార్చేందుకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రభుత్వం వద్ద పట్టుబట్టి నియోజకవర్గంలోని మద్నూర్ మండల కేంద్రంలోని సోమలింగాల గుట్ట ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయించి భవన నిర్మాణం కోసం అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా 305 కోట్ల నిధులతో17/12/2024 రోజున శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు విద్యాభివృద్ధి కోసం ఎమ్మెల్యే జుక్కల్ నియోజకవర్గాన్ని విద్య హబ్బుగా మార్చాలని ఉద్దేశంతో ఈ రెసిడెన్షియల్ పాఠశాలను మద్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయడానికి జిల్లా ఇన్చార్జి మంత్రి ద్వారా శంకుస్థాపన జరిపించగా ఆ శంకుస్థాపన శిలాఫలకం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు భారీ నిధులతో పాఠశాల భవనం నిర్మించడానికి షీలా ఫలకం వేసి శంకుస్థాపన చేస్తే దానిని పగలగొట్టడం ఎమ్మెల్యే చేసే అభివృద్ధి పనులను చూడలేకనే కొందరు ఇలా చేసి ఉంటారని అనుమానం వ్యక్తపరుస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -