Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్మూర్ పరిధిలో బడిబాట..

ఆర్మూర్ పరిధిలో బడిబాట..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపాలిటీ పరిధిలోని  పెరికిటు తెలుగు మీడియం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి , ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించినారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీడిసి అధ్యక్ష కార్యదర్శులు రాజు, నచ్చు గంగాధర్, మట్ట శ్రీనివాస్, సభ్యులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పర్వీన్ సుల్తానా , ఉర్దూ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడి టీచర్స్, ఆశ వర్కర్లు, మహిళా సంఘం రిసోర్స్ పర్సన్లు, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పట్టణంలోని రామ్ మందిర్, బాలుర, బాలికల మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి మండలంలోని పలు పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించినారు. పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో రామ్ మందిర్ పాఠశాల ప్రధానో పాధ్యాయులు గద్దె గంగాధర్, మామిడిపల్లి ప్రధానోపాధ్యాయులు  రవీందర్ ఉపాధ్యా బృందం తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -