నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట కాంప్లెక్సు పరిధిలోని పాఠశాలల ఆవాసాలు లో ఉపాధ్యాయులు ఆదివారం బడిబాట కరపత్రాల తో ప్రచారం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి 5 సంవత్సరాలు దాటిన పిల్లల జాబితాలను సేకరించారు.ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే కలిగే ప్రయోజనాలను వివరించారు. తెలంగాణా ప్రభుత్వం విద్యార్ధుల కోసం ఎంతో ఖర్చు చేస్తుందని అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని అమ్మ దర్శ పాఠశాల కమిటీల ద్వారా అవసరమైన సదుపాయాలను విద్యార్ధులకు అందిస్తుందని వివరించారు. నందమూరి నగర్ లో జరుగుతున్న ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
కరపత్రాలతో బడిబాట ప్రచారం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES