ప్రధానోపాధ్యాయులు ఈసం కృష్ణయ్య
నవతెలంగాణ – తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం రంగాపూర్ ఆశ్రమ పాఠశాలలో సోమవారం బడిబాట కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు ఈసం కృష్ణయ్య, మాజీ సర్పంచ్ ఇర్ప అశ్విని సూర్యనారాయణ లు ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అవగాహన కల్పించారు. రంగాపూర్ ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ యూనిఫామ్స్ మధ్యాహ్నం భోజనం రాగిజావ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి, ఉపాధ్యాయులు యాప సమ్మయ్య, కొక్కెర రమేష్,మహిపతి సంతోష్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
రంగాపూర్ లో బడిబాట కార్యక్రమం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES