నవతెలంగాణ – హైదరాబాద్: సమ్మర్ హాలీడేస్ ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. మొత్తం 61 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. స్కూళ్లు రీఓపెన్ అవుతున్న గురువారం రోజునే సర్కారు బడుల్లోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పలు బడుల్లో విద్యార్థులకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. రాష్ట్రంలో సర్కారు, ప్రయివేట్ కలిపి మొత్తం 41,354 స్కూళ్లు ఉండగా, వాటిలో 61.99 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రయివేట్లో11 వేలకు పైగా స్కూళ్లు ఉండగా.. 36.87 లక్షల మంది స్టూడెంట్లు ఉన్నారు. మిగిలిన వారంతా గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నారు.
నేటి నుంచి పాఠశాలలు పున: ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES