- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పాఠశాలలు పరిశుభ్రంగా ఉండే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంఈఓ రాజా గంగారెడ్డి ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. బుధవారం ప్రధానోపాధ్యాయులు, సానిటరీ వర్కర్ల శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేటి నుండి పాఠశాలలు పునః ప్రారంభం కావున పాఠశాల పరిసరాలు, టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధానోపాధ్యాయులు, సానిటరీ వర్కర్లు, ఎం ఆర్ సి సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -