ప్రైవేటు వద్దు… ప్రభుత్వమే ముద్దు
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, బడి బాటలో ప్రభుత్వ ఉపాధ్యాయుల మాట,
ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలకా, లేదా ప్రైవేట్ పాఠశాలలకా,
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రజలు.
నవ తెలంగాణ మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క ఉపాధ్యాయునికి లక్షలాది రూపాయలు నెల నెల జీతాలు చెల్లిస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన కోసం అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలు కొనసాగిస్తుంది ప్రైవేటు వద్దు ప్రభుత్వమే ముద్దు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధన అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమాల్లో ప్రభుత్వ పంతులంతా గ్రామ గ్రామాన ఇంటింటా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇక వేసవి సెలవులు ముగిశాయి ఈనెల 12 నుండి పాఠశాలలు పునా ప్రారంభమై గురువారం నుండి బడి గంటలు మోగనున్నాయి.
ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అంటారు ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ప్రైవేట్ కు పంపుతారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బోధన సరిగ్గా లేకపోవడమా లేదా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేనందున ఉపాధ్యాయుల పిల్లలు సర్కారు బడుల్లో ఎందుకు నేర్పించరు అనే చర్చ ప్రజల్లో జోరుగా వినబడుతుంది ప్రభుత్వం విద్యా బోధన కోసం ప్రభుత్వ పాఠశాలలో అనేక రకమైన సౌకర్యాలు ఉచిత పుస్తకాలు ఉచిత నోట్ బుక్స్ మధ్యాహ్న భోజన వసతి యూనిఫామ్ డ్రెస్సులు ఇలా ఎన్నో రకాల సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందిస్తున్నామని ప్రభుత్వ ఉపాధ్యాయులే గొప్పలు చెప్పుకుంటూ ఊరూర వాడ వాడ బడిబాట కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు అందరి కోసమా లేక ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ప్రైవేట్ కు పంపడం మిగతా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో నేర్పాలని నిబంధనలు పెట్టడం ఇలాంటి చదువుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ముందుగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటే మిగతా పిల్లలు కూడా సర్కారు బడుల్లోనే చదువుకోవాలని అనుకుంటా రూ సర్కారు బడుల ఉపాధ్యాయులకు లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తుంటే వారి పిల్లలు సర్కారీ బడుల్లో ఎందుకు నేర్పుతారు లక్షలు లక్షలు వెచ్చించి ప్రైవేటు కార్పోరేట్ పాఠశాలలకు పంపుతారు ఇదెక్కడి చట్టం అందరికీ సమానమే ఉండాలి. ముందుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పిల్లలు సర్కారు బడుల్లోనే ఉండే విధంగా చట్టం తెచ్చే వరకు ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందా అనేది ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈనెల 12న బడి గంటలు మోగనున్నాయి పాఠశాలల ప్రారంభంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ ఉంటారు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సాధించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.