Sunday, June 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంట మార్పిడి పై శాస్త్రవేత్తలు అవగాహన సదస్సు

పంట మార్పిడి పై శాస్త్రవేత్తలు అవగాహన సదస్సు

- Advertisement -

నవతెలంగాణ -మోపాల్ 
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మోపాల్ మండలంలోని ఆమ్రాబాద్ గ్రామం లో కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ వారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అనుబంధంతో రైతులకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొదటిగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించారు. రైతులు తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించడం, అవసరం మేరకు రసాయనాలను వినియోగించి నేల ఆరోగ్యం కాపాడడం, రసీదులను భద్రపరచి కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందడం, సాగు నీటిని ఆదా చేయడం, పంట మార్పిడి పాటించి -సుస్థిర ఆదాయాన్ని పొందడం, చెట్లను పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడం వంటి అంశాలని చర్చించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా డా. టి. అంజయ్య ప్రోగ్రాం కోఆర్డినేటర్ కెవికే రుద్రూరు  నేల ఆరోగ్య పరిరక్షణ గురించి వివరిస్తూ అధిక రసానిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని మరియు సేంద్రియ ఎరువుల వాడకం వలన పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి నేలలో కర్బన శాతం పెరుగుతుందని తెలియజేశారు మరియు వరికి ముందు పచ్చి రొట్టెఎరువులు సాగు చేసి భూమిలో కలియదున్నడం వల్ల పంటలో వేసే యూరియా శాతాన్ని తగ్గించుకోవచ్చని అన్నారు. భూసార పరీక్షల ఆవశ్యకత భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వేయడం యొక్క ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. అలాగే వానకాలానికి అనువైన వరి రకాలైన కూనారం 1638, వరంగల్ సిద్ది, WGL 1119, రుద్రూరు నుంచి విడుదలైన RDR 1200, RDR 1162 రకాలు, రాజేంద్రనగర్ నుంచి విడుదలైన RNR 15048, రాజేంద్రనగర్ వరి 4 రకాల గురించి తెలియజేశారు. అదేవిధంగా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రతి గ్రామంలో విత్తనం కార్యక్రమం గురించి కూడా రైతులకు వివరించడం జరిగింది.అలాగే మోపాల్ మండల వ్యవసాయ అధికారి సౌమ్య  మాట్లాడుతూ రైతులు విత్తన కొనుగోలులో పాటించవలసిన జాగ్రత్తలు, విత్తనంలో మొలక శాతం చూసుకుని సరిపడా వర్షం పడిన తర్వాతే పంట విత్తుకోవాలని సూచించడం జరిగింది. అదేవిధంగా చిరు సంచుల దశలో ఉన్నటువంటి వివిధ పంటల రకాలను కూడా ఆ గ్రామ రైతుల క్షేత్రాల్లో పరిశీలన చేపట్టాలని కోరారు.

అలాగే రైతులకి అందుబాటులోకి తీసుకు వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని పంట మార్పిడి, పచ్చి రొట్ట ఎరువుల వాడడం మరియు కలియుదున్నడం వలన భూమిలోని సేంద్రియ పదార్థాన్ని పెంపొందించుకుని చౌడువారకుండా కాపాడుకోగలమని సూచించారు. విశ్వవిద్యాలయం ద్వారా రూపొందించబడినటువంటి కొత్త రకాలను సాగు చేయాలని మరియు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్న సాంకేతిక విషయాలను అవలంబించాలని తెలియజేశారు. అలాగే శిరీష  వెటర్నరీ డాక్టర్, మాట్లాడుతూ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా పాడి పశువుల ఉన్న రైతులు కచ్చితంగా టీకాలు వేయించాలని అదేవిధంగా మేలు జాతి పశువులను రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. నూతన సాంకేతికత వచ్చిన కృత్రిమ గర్భధారణ గురించి రైతులకు వివరించారు.

డా. బి.వి రాజ్ కుమార్ శాస్త్రవేత్త కూరగాయలలో తెగుళ్లు అలాగే చీడపీడల సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేశారు. అదేవిధంగా రైతులకు అందుబాటులో ఉన్న వివిధ సమాచార సాధనాలైన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యూట్యూబ్ ఛానల్, వ్యవసాయ మాసపత్రిక మరియు కిసాన్ సారథి ద్వారా రైతులకు అందిస్తున్న సమాచార సేవలను గురించి రైతులకి వివరించారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ టి అంజయ్య గారు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్ర, రుద్రూర్డా. బి. వి. రాజ్ కుమార్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్ సౌమ్య మండల వ్యవసాయ అధికారి, శిరీష  వెటర్నరీ డాక్టర్,ఎ ఈ ఓ భావన, గ్రామ అభ్యుదయ రైతులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -