75.10 పోలింగ్ శాతం
ఎన్నికల్లో పాల్గొన్న వృద్ధులు యువకులు
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని 21 గ్రామపంచాయతీలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అన్ని గ్రామాలలో ఉదయం ఏడు గంటల నుంచి 1:00 వరకు ఎన్నికలు నిర్వహించగా 75.10 పోలింగ్ జరిగినట్లు మండల ఎన్నికల అధికారులు తెలిపారు. కొలి ప్యాక్ లొ కోటరు మెట్ల పైనుండి కింద జారి పడగా కుడికాలు తొంటి తిరిగింది.
కొలిప్యాక్ గ్రామంలో సార్వత్రిక గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించడానికి వెళ్లిన గ్రామవాసి గడ్డం భాస్కర్ రెడ్డి ( 60) ఓటర్ లైన్ లో నిలబడి మెట్లపై నుండి కింద జారీ పడ్డాడు. అతని కుడికాలు తొంటి విరిగింది వెంటనే అతన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగిందని గ్రామ ప్రజలు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యువకులు వృద్ధులు మధ్య వయసు గలవారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.



