Tuesday, June 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపనులను బహిష్కరించిన కార్యదర్శులు

పనులను బహిష్కరించిన కార్యదర్శులు

- Advertisement -

– ట్రాక్టర్‌ తాళాలు ఎంపీడీవోకు అందజేత
– తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన
నవతెలంగాణ-పరిగి

వికారాబాద్‌ జిల్లా పరిగి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన కార్యదర్శులు సోమవారం గ్రామాల్లో ఆర్థికపరమైన పనులను బహిష్కరించారు. ట్రాక్టర్‌ తాళాలను ఎంపీడీవోకు అందజేసి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 2024 నుంచి ఇప్పటివరకు అప్పులు చేసి గ్రామపంచాయతీ అభివృద్ధికి ఖర్చు చేశామని తెలిపారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేయడం లేదన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఇంతకుమించి విధులు ఖర్చు చేయడం తమ వాళ్ల కావడం లేదన్నారు. అందుకే విధులను బహిష్కరిస్తూ, ట్రాక్టర్‌ తాళాలను ఎంపీడీవోకు అందజేసినట్టు చెప్పారు. తమ సమస్యలను పరిష్కారించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -