- Advertisement -
నవతెలంగాణ – కనగల్
పులిమామిడి గ్రామపంచాయతీ కార్యదర్శి ఆవుట మోహన్ రావు శుక్రవారం ఎస్ లింగోటం వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా నల్గొండ నుండి పులిమామిడికి వస్తున్న క్రమంలో ఈరోజు ఉదయం ఆరున్నరకు లింగోటం దగ్గరకు చేరుకుంటున్న తరుణంలో హాలియా నుండి నల్గొండకు వెళ్తున్న టాటా ఏసి వాహనం మోహన్ రావు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



