పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త ఎ.రమాదేవి
అభ్యుదయ రైతులకు విత్తనాలందజేత
నవతెలంగాణ – బెజ్జంకి : ప్రతి గ్రామంలో నాణ్యమైన విత్తనాలందించాలనే సదుద్ధేశ్యంతో అభ్యుదయ రైతులకు ప్రభుత్వం విత్తనాలందజేస్తుందని..వాటిని సాగు చేసి విత్తనాలను తోటి రైతులకు అందించాలని తోర్నాల వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త ఎ.రమాదేవి సూచించారు.మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదిక యందు పరిశోధన కేంద్రం రూపొందించిన వరి,పెసర విత్తనాలను శాస్త్రవేత్త రమాదేవి ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,ఏఓ సంతోష్, ఏఈఓలు రేణకా శ్రీ,తేజస్విని,భరత్,సాయి శంకర్,ఆత్మాధికారి సాయి చరణ్ తో కలిసి అభ్యుదయ రైతులకు అందజేశారు.అనంతరం పంటల సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై శాస్త్రవేత్త రమాదేవి అభ్యుదయ రైతులకు పలు సూచనలు చేశారు.
తోటి రైతులకు విత్తనాలందజేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES