- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
సీజ్ చేసి నిల్వ ఉంచిన ఇసుకను ఈనెల 8న వేలం వేస్తున్నట్లు శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు సీజ్ చేసి నిల్వ ఉంచారు. ఈ నేపథ్యంలో ఇసుకను 8న పోలీస్ స్టేషన్ ఆవరణంలో వేలం వేస్తామని శ్రీనివాస్ అన్నారు. ఆసక్తి గల వ్యక్తులు 8 వ తేదీన ధరవత్తు రుసుము 5000 చెల్లించి వేలంలో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -



