Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత 

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత 

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి : మండల కేంద్రం లోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 2 బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఎద్దులు 8,  ఆవులు 2, బర్రె దూడలు 2, చిన్న దూడలు(లాగులు) 2 మొత్తం 14 పశువులను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పినపాక సమీపంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో పశువులు కొనుగోలు చేసి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా రెండు బోలేరో వాహనాల్లో తరలిస్తున్నారని వారు పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున తమ వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో రెండు బొలెరో వాహనాలు వస్తుండగా తనిఖీ చేశామని చెప్పారు. వీటిని హైదరాబాదు తలచినట్లు తమ విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. ఈ మేరకు సదరు ఇద్దరు డ్రైవర్ల పై కేసు నమోదు చేశామని, పట్టుకున్న 14 పశువులను భూపాలపల్లి జిల్లా రాంపూర్ గోశాలకు తరలించినట్లు తెలిపారు. నిబంధన లకు విరుద్ధంగా మూగజీవాలను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. తనిఖీల్లో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -