నవతెలంగాణ – హైదరాబాద్: నారాయణపేట జిల్లా మఖ్తల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలితే.. లారీని వోల్వో బస్సు వెనుక నుంచి ఢీకొన్న సంఘటనలో దాదాపు 18 మందికి ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్లేర్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. శివమొగ్గ నుంచి దాదాపు 30 మంది హైదరాబాద్ కి వెళ్తున్న శ్రీ దుర్గాంబా ట్రావెల్స్ బస్సు వర్షం పడుతుండటంతో ప్రమాదవశాత్తు వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కావడం తో దాదాపు 18 మందికి ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా డ్రైవర్ రెండు కాళ్ళు విరిగి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న మక్తల్ పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే వోల్వో బస్సులో దాదాపు 30 మంది పైనే ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
మఖ్తల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES