నవతెలంగాణ – హైదరాబాద్: కోల్కత్తా నైట్రైడర్స్ టీం నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్, పేస్ బౌలర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ను రిలీజ్ చేయాలని కేకేఆర్ యాజమాన్యాన్ని బీసీసీఐ ఆదేశించింది. బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు పేట్రేగిపోవడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ క్రికెటర్కు ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వడం సమంజసం కాదని భావించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ముస్తఫిజుర్ రెహ్మాన్ను వదిలేసుకున్న క్రమంలో రీప్లేస్మెంట్ కోరేందుకు కేకేఆర్ జట్టుకు అవకాశం ఇస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో ఐపీఎల్ వేలంలో నిలిచిన ముస్తఫిజుర్ను 9.20 కోట్లకు కేకేఆర్ జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మంచి ఫామ్ లో ఉన్న పేస్ బౌలర్ కావడంతో ముస్తఫిజుర్ కోసం చెన్నై, ఢిల్లీ జట్లు కూడా పోటీ పడగా కేకేఆర్ అత్యధిక ధరకు ఈ బంగ్లా పేసర్ ను దక్కించుకుంది.
కేకేఆర్ కు ఎదురుదెబ్బ.. ముస్తాఫిజుర్ ను రిలీజ్ చేయండి: బీసీసీఐ ఆదేశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



