Sunday, June 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపడవ బోల్తాపడి ఏడుగురు టూరిస్టులు మృతి

పడవ బోల్తాపడి ఏడుగురు టూరిస్టులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ఖైబర్‌ పఖ్తున్వ్ఖాలో స్వాత్‌ నదిపై వెళుతున్న పడవ బోల్తాపడి ఆదివారం ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. ఈ విషయాన్ని రెస్క్యూ అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్‌లోని స్వాత్‌ జిల్లాలోని కలాంలోని షాహిబాగ్‌ ప్రాంతంలో పది మంది పర్యాటకులతో వెళుతున్న పడవ బోల్తాపడడంతో పదిమందిలో ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. మిగిలిన ముగ్గురిని స్థానికులు కాపాడారు.
కాగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మరో ముగ్గురి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రెస్క్యూ అధికారులు వెల్లడించారు. అయితే మారుమూల ప్రాంతం కావడం వల్ల రెస్క్యూ ఆపరేషన్స్‌కి తీవ్ర ఆటంకం ఏర్పడిందని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై జాతీయ అసెంబ్లీ సభ్యుడు డాక్టర్‌ అమ్జాద్‌ అలీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు తన సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంలో గల్లంతైన మూడు మృతదేహాలను వెలికితీసే పనులు మరింత వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -