– ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట : క్రిష్టియన్ మైనార్టీ మహిళా దర్జీలకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కుట్టు మిషన్ లు అందజేయనుంది. నియోజక వర్గం వ్యాప్తంగా ఎంపికైన 18 లబ్ధిదారులకు సోమవారం నియఛజక వర్గంలోని ములకలపల్లి రైతు వేదికలో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో ఈ కుట్టు మిషన్ లను ఎంపీ రామ సహాయం రఘు రామ రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతులు మీదుగా అందజేయనున్నట్లు అశ్వారావుపేట ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఆదివారం నవతెలంగాణ కు తెలిపారు.
ఎంపికైన లబ్ధిదారులకు కార్యక్రమానికి సకాలంలో చేరుకోవాలని తెలిపారు. 5 మండలాల నుంచి 26 మంది రిజిష్టర్ చేసుకోగా 18 మంది ఎంపికయ్యారు అని అన్నారు. దమ్మపేట నుండి 23 మంది కి గాను 15 మంది,ములకలపల్లి నుండి 2 ఇద్దరికి 2 ఇద్దరు,అశ్వారావుపేట నుండి 1 ఒక్కరికి ఒక్కరు లబ్ధిదారులుగా ఎంపికయ్యారన్నారు. చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల నుండి ఎవరూ రిజిష్టర్ చేసుకోలేదని తెలిపారు.
మండలం రిజిస్ట్రేషన్ సెలెక్టెడ్
అశ్వారావుపేట 01 01
దమ్మపేట 23 15
ములకలపల్లి 02 02
అన్నపురెడ్డిపల్లి —— —–
చండ్రుగొండ ——- —-
మొత్తం 26 18