Monday, June 30, 2025
E-PAPER
Homeఖమ్మంక్రిష్టియన్ మైనార్టీలకు కుట్టుమిషన్ లు..

క్రిష్టియన్ మైనార్టీలకు కుట్టుమిషన్ లు..

- Advertisement -

– ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
: క్రిష్టియన్ మైనార్టీ మహిళా దర్జీలకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కుట్టు మిషన్ లు అందజేయనుంది. నియోజక వర్గం వ్యాప్తంగా ఎంపికైన 18 లబ్ధిదారులకు సోమవారం నియఛజక వర్గంలోని ములకలపల్లి రైతు వేదికలో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో ఈ కుట్టు మిషన్ లను ఎంపీ రామ సహాయం రఘు రామ రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతులు మీదుగా అందజేయనున్నట్లు అశ్వారావుపేట ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఆదివారం నవతెలంగాణ కు తెలిపారు.

ఎంపికైన లబ్ధిదారులకు కార్యక్రమానికి సకాలంలో చేరుకోవాలని తెలిపారు. 5 మండలాల నుంచి 26 మంది రిజిష్టర్ చేసుకోగా 18 మంది ఎంపికయ్యారు అని అన్నారు. దమ్మపేట నుండి 23 మంది కి గాను 15 మంది,ములకలపల్లి నుండి 2 ఇద్దరికి 2 ఇద్దరు,అశ్వారావుపేట నుండి 1 ఒక్కరికి ఒక్కరు లబ్ధిదారులుగా ఎంపికయ్యారన్నారు. చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల నుండి ఎవరూ రిజిష్టర్ చేసుకోలేదని తెలిపారు.

మండలం             రిజిస్ట్రేషన్            సెలెక్టెడ్ 
అశ్వారావుపేట         01                      01
దమ్మపేట                 23                      15
ములకలపల్లి            02                      02
అన్నపురెడ్డిపల్లి       ——                  —–
చండ్రుగొండ         ——-                 —-
మొత్తం                    26                       18

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -