నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ని 22 మంది సభ్యులతో అఖిల భారత కాంగ్రెస్ కమీటి ఏర్పాటు చేసినట్లు దోమకొండ మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ తెలిపారు. ఆ కమిటీలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ ను చేర్చడం పై కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దీని పురస్కరించుకొని దోమకొండ మండల మాజీ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ శుక్రవారం కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో షబ్బీర్ అలీ నీ శాలువ కప్పి సన్మానించరు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ మామిండ్ల లక్ష్మీ అంజయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల రాజిరెడ్డి, బిక్నూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, దోమకొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సీతారామ్ మధు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీకి ఎంపికైన షబ్బీర్ అలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES