- Advertisement -
మండల అధ్యక్షులు సుతారి రమేష్
నవతెలంగాణ –  కామారెడ్డి: బిబిపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ  కృషితో గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి ఎన్.ఆర్. ఈ.జీ.ఎస్  నిధులతో రూ.15 లక్షలతో నిధులు మంజూరు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు సుతరి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, జిల్లా నాయకులు భూమా గౌడ్, మండల యువజన అధ్యక్షులు మహేష్ కుమార్, మాదాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతకుంట రాకేష్ రెడ్డి, రోడ్డరాజు, శ్రీనివాస్ గౌడ్, నరసింహులు,  రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ,శ్రీకాంత్ రెడ్డి బాబు  తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    