నవతెలంగాణ – బాల్కొండ
ఈ అభ్యాస్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో రామన్ సైన్స్ మహోత్సవంలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఆర్ఎంఎస్ ఒలంపియాడ్ రాష్ట్రస్థాయి పోటీలో శాంభవి విద్యార్థిని రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిందని పాఠశాల చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు తెలిపారు. ఈనెల 5 న సోమవారం ప్రకటించిన ఫలితాలలో శాంభవి హై స్కూల్ 9వ తరగతి చదువుతున్న నూజత్ 100 కు 96 మార్కులతో స్టేట్ లెవెల్ సెకండ్ ర్యాంక్ సాధించింది. స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థిిని నుజాత్ కు పాఠశాల యాజమాన్యం ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. పాఠశాల చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు, కరస్పాండెంట్ రవీంద్ర ప్రసాద్ మంగళవారం పాఠశాలలో నూజత్ కు ప్రశంస పత్రము అందజేశారు. ఈ ఘనత సాధించిన విద్యార్థిని నూజత్ కు ఉపాధ్యాయ బృందం అభినందించారు.
రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంక్ సాధించిన శాంభవి విద్యార్థిని
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



