Monday, June 9, 2025
E-PAPER
Homeఆటలుశిఖర్‌ సింగ్‌కు రూ. 16 లక్షలు

శిఖర్‌ సింగ్‌కు రూ. 16 లక్షలు

- Advertisement -

రికార్డు ధరకు హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ సొంతం
ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ 4 ఆటగాళ్ల వేలం
కాలికట్‌ (కేరళ) :
కాలికట్‌ వేదికగా ఆదివారం జరిగిన ప్రైమ్‌ వాలీబాల్‌ (పీవీఎల్‌) నాలుగో సీజన్‌ వేలంలో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ జట్టు ప్లాటినం కేటగిరీ నుంచి శిఖర్‌ సింగ్‌ను రూ.16 లక్షలకు దక్కించుకుంది. అమన్‌ కుమార్‌, దీపు వేణుగోపాల్‌ను వరుసగా రూ.11.5 లక్షలు, రూ.5.75 లక్షలకు కొనుగోలు చేసింది. వేలంలో జెరోమ్‌ వినీత్‌ సి అందరి దష్టిని ఆకర్షించాడు. చెన్నై బ్లిట్జ్‌ అతడిని ప్లాటినం కేటగిరీలో రూ. 22.5 లక్షలకు కొనుగోలు చేసింది. దాంతో లీగ్‌లో తను అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. కాలికట్‌ హీరోస్‌ స్థానిక ఆటగాడు షమీముద్దీన్‌ను రూ.22.5 లక్షలకు దక్కించుకుంది. కొచ్చి బ్లూ స్పైకర్స్‌ వినీత్‌ కుమార్‌ను అదే మొత్తానికి కొనుగోలు చేసింది. బెంగళూరు టార్పెడోస్‌ గోల్డ్‌ కేటగిరీ నుంచి జిష్ణు పీవీని రూ.14 లక్షల భారీ మొత్తానికి దక్కించుకుంది. అలాగే జోయెల్‌ బెంజమిన్‌. జె ని రూ.6.5 లక్షలకు కొనుగోలు చేసింది. ఇబిన్‌ జోస్‌, రోహిత్‌ కుమార్‌ చెరో రూ.5 లక్షలతో అదే జట్టులో చేరారు. చెన్నై బ్లిట్జ్‌, బెంగళూరు టార్పెడోస్‌, కోల్‌కతా థండర్‌ బోల్ట్స్‌ మధ్య జరిగిన బిడ్డింగ్‌ వార్‌ తర్వాత గతంలో కాలికట్‌ హీరోస్‌ తరఫున ఆడిన వినీత్‌ను చెన్నై రూ.22.5 లక్షలకు కొనుగోలు చేసింది. ప్లాటినం కేటగిరీ నుంచి చెన్నై ఎం. అశ్విన్‌ రాజ్‌ , సమీర్‌ చౌదరి (రైట్‌ టు మ్యాచ్‌) ఒక్కొక్కరిని రూ.8 లక్షలకు తమ జట్టులో చేర్చుకుంది.
షమీముద్దీన్‌తో పాటు, కాలికట్‌ హీరోస్‌ అనుభవజ్ఞుడైన సెట్టర్‌ మోహన్‌ ఉక్రపాండియన్‌ (రైట్‌ టు మ్యాచ్‌) , సంతోష్‌ ఎస్‌ లను వరుసగా రూ.8 లక్షలకు దక్కించుకుంది.
అమల్‌ కె థామస్‌ రూ.6.5 లక్షలకు కొచ్చి బ్లూ స్పైకర్స్‌ జట్టులో చేరగా, జస్‌జోధ్‌ సింగ్‌ను గోల్డ్‌ కేటగిరీ నుంచి రూ.14.75 లక్షలు పలికాడు. అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌ షాన్‌ టి జాన్‌ను (రైట్‌ టు మ్యాచ్‌) అట్టిపెట్టుకోవడానికి రూ.11.5 లక్షలు వెచ్చించగా , అంగముత్తు, అఖిన్‌ జీఎస్‌ వరుసగా రూ.11 లక్షలు , రూ.10.5 లక్షలకు అదే జట్టులో చేరారు. ఢిల్లీ తూఫాన్స్‌ జట్టు ప్లాటినం కేటగిరీలో రూ.9 లక్షలకు ఆయుష్‌ ను దక్కించుకుంది. గోల్డ్‌ కేటగిరీలో జార్జ్‌ ఆంటోనీ రూ.5 లక్షలకు ఢిల్లీ జట్టులో చేరగా , మన్నత్‌ చౌదరి రూ.6.5 లక్షలకు ఆ టీమ్‌ సొంతమయ్యాడు. కార్తీక్‌.ఎ, ల్యాడ్‌ ఓం వసంత్‌ను ముంబై మెటియోర్స్‌ టీమ్‌ ప్లాటినం కేటగిరీలో చెరో రూ.8 లక్షలకు దక్కించుకోగా, గోల్డ్‌ కేటగిరీలో ముంబై విపుల్‌ కుమార్‌ను (రైట్‌ టు మ్యాచ్‌) రూ.6.25 లక్షలకు.. సోను, నిఖిల్‌ను ఒక్కొక్కరిని రూ.5 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రిన్స్‌, రామానథన్‌ ప్లాటినం కేటగిరీ నుంచి రూ.8 లక్షలకు గోవా గార్డియన్స్‌ జట్టులో చేరారు. అమిత్‌ చ్లోకర్‌ (రూ.5 లక్షలు) కూడా ఆ జట్టు సొంతమయ్యాడు. పంకజ్‌ శర్మను కోల్‌కతా థండర్‌ బోల్ట్స్‌ గోల్డ్‌ కేటగిరీలో రూ.6 లక్షలకు కొనుగోలు చేసింది. సజన్‌ శెట్టి రూ.5 లక్షలకు కోల్‌కతా టీమ్‌లో చేరాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -