జియో యూజర్లకు షాక్..!

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇప్పటికే టారిఫ్‌లు పెంచిన జియో రెండు పాపులర్ ప్లాన్స్‌లను తొలగించి తన యూజర్లకు మరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూజర్లు ఎక్కువగా వాడే రూ.395, రూ.1,559 ప్లాన్లను తొలిగించిందట. కొత్త టారిఫ్‌లు జులై 3 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో ఒక విడత అదనపు ఛార్జీలు తప్పించుకునేందుకు ఒకరోజు ముందే రీఛార్జ్ చేసుకోవడానికి యూజర్లు ప్రయత్నిస్తున్నారు. కాగా ఆ 2 ప్లాన్లు కనిపించడం లేదని కొందరు ఎక్స్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు.

Spread the love