ఆందోళన చేస్తున్న రైతులు..
నవతెలంగాణ – శామీర్ పేట : మండల కేంద్రంలోని శామీర్ పేట ధాన్యం కొనుగోలు సెంటర్ వద్ద గన్ని సంచులు కొరత ఏర్పడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం నింపడానికి సంచుల కొరత ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 8000 సంచులకు గాను 2400 సంచులు రావడంతో ఏ రైతుకు ఇవ్వాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. 6000 సంచులు తక్కువ పడటంతో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. సంచులు ఎప్పుడు ఇస్తారు అని అధికారులు అడిగితే పొంతన లేని సమాధానం చెబుతున్నారని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే 226 టోకెన్లు రైతులకు ఇచ్చామని సిబ్బంది పేర్కొన్నారు. సంచులు లేకపోవడంతో దాన్యం వరి కల్లాల్లోనే నిలిచిపోయిందని రైతులంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సంచుల కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
శామీర్ పేట సొసైటీలో గన్ని సంచుల కొరత ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES