– ఎంఈవోలకు విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డి ఆదేశం
– హైదరాబాద్లో ఎంఈవోల శిక్షణ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో మండల విద్యాధికారులు (ఎంఈవో)దే కీలక పాత్ర ఉంటుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డి చెప్పారు. నాయకత్వం, పర్యవేక్షణ, విద్యాశాఖ కార్యక్రమాలపై మూడురోజుల శిక్షణా కార్యక్రమం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో సోమవారం ప్రారంభమైంది. 629 మంది ఎంఈవోలకు గాను రెండు విడతల్లో ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో 304 మంది ఎంఈవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ మండల స్థాయిలో ఉపాధ్యాయుల శిక్షణను నిర్వహిం చినందుకు ఎంఈవోలను అభినందించారు. ఎంఈవోలందరూ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం కృషి చేయాలని ఆదేశించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి మండలానికీ ఎంఈవో ఉన్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగేలా వారి పనితీరు ఉండాలన్నారు. బడిబాట కార్యక్రమంలో ఎంఈవో ప్రత్యేక కార్యాచరణతో వారి మండలంలో ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీ, గురుకులాలు, యూఆర్ఎస్ పాఠశాలల్లో పనిచేస్తున్న 1,22,854 మంది ఉపాధ్యాయులకు ఐదు రోజల శిక్షణ కార్యక్రమాన్ని ఈనెల 13 నుంచి ప్రారంభించామని గుర్తు చేశారు. వారికి శిక్షణ ఇచ్చేందుకు 5,605 మంది రిసోర్స్ పర్సన్లకు ఐదు రోజులు శిక్షణ ఇచ్చామని అన్నారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో 866 కేంద్రాల్లో 94,794 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని వివరించారు. మిగిలిన వారికి మూడో విడతలో సోమవారం నుంచి ఈనెల 30 వరకు నిర్వహిస్తామన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విద్యా ర్థుల విద్యా ప్రమాణాలను పెంచడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
ప్రభుత్వ బడులపై నమ్మకం పెరిగేలా చూడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES