సాహితీవేత్తలకు శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి సూచన
తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో పురస్కారాల ప్రదానోత్సవం
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
విద్యారంగం ఆంగ్లమయమైన పరిస్థితుల్లో మాతృభాష తియ్యదనాన్ని చాటాలని రాష్ట్ర శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి సాహితీ వేత్తలకు సూచించారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లోని డా.దేవులపల్లి రామానుజరావు కళామందిరం లో జరిగిన రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రంథ పురస్కార ప్రదానోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. పిల్లలు పాఠశాలల్లో గడిపిన సమయమంతా ఇంగ్లీషులోనే మాట్లాడాల్సి వస్తోందని, ఈ పరిస్థితి పోవాలంటే తల్లిదండ్రులతో పాటు సాహితీవేత్తలు కూడా కృషి చేయాలన్నారు. నాడు స్వాతంత్య్ర పోరాటంలోనైనా, అనంతరం నిజాం వ్యతిరేక పోరాటంలోనైనా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనైనా సాహిత్యం పాత్ర ప్రధానమైందని తెలిపారు. నిజాం పాలన కాలంలో తెలుగు భాషకు ఆదరణ లేనికాలంలో ఏర్పాటైన సారస్వత పరి షత్తు ఇంతకాలంగా సాహిత్యాన్ని, భాషను బతికిస్తు న్నదని ప్రశంసించారు.
పరిషత్తు అధ్యక్షులు ఆచా ర్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ.. సుర వరం ప్రతాపరెడ్డి, మాడపాటి హను మంతరావు, డాక్టర్ దేవులపల్లి రామానుజరావు, డా.సి.నారా యణరెడ్డి వంటి పెద్దలు చూపిన మార్గంలో పరిషత్తును ఆదర్శప్రాయంగా నిర్వహిస్తున్నామ న్నారు. 2025 సంవత్సరానికి పద్య గేయ కవిత విభాగంలో డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు, వచన కవితా విభాగంలో డాక్టర్ ఉదారి నారాయణ, కథా ప్రక్రియలో డాక్టర్ రామాచంద్ర మౌళి, నవలా విభాగంలో డాక్టర్ కాలువ మల్లయ్య, సాహిత్య విమర్శలో డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, ఇతర ప్రక్రియల్లో డాక్టర్ సంగనభట్ల నర్సయ్య, బాల సాహిత్యంలో డాక్టర్ అమరవాది నీరజ పుర స్కారాలు అందుకున్నారు. రంగరాజు పద్మజ ఎల నాగ, డాక్టర్ ఎన్ఆర్ వెంకటేశం, రూప్ కుమార్ డబ్బీకార్ వరిష్ఠ పురస్కారాలు అందుకు న్నారు. పురస్కారం కింద రూ.20 వేలు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు, కార్యవర్గ సభ్యులు రింగు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
మాతృభాష తియ్యదనాన్ని చాటండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES