నిర్మాత హరిత గోగినేని, ఏఆర్ అభి ఆధ్వర్యంలో హైదరాబాద్ చిత్రపురి కాలనీలో త్రివణ గురుపీఠాన్ని ఏర్పాటు చేశారు. డివోషనల్, స్పిరిచువల్, ఆస్ట్రాలజీ కలిపి ఒక కొత్త మార్గాన్ని త్రివణ గురుపీఠం ద్వారా ఆవిష్కరిస్తున్నారు.
ఈ త్రివణ గురుపీఠం ప్రారంభోత్సవ కార్యక్రమం పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ, ‘సమస్యలు ఉన్నవారికి, అర్థం కాని ప్రశ్నలు ఎదురైన వారికి సమాధానాలు ఇచ్చే విధంగా ఇక్కడ ప్రయత్నిస్తాం. నేను చేసిన మంత్రసాధనం, జ్యోతిష్య సాధనం పలువురితో పంచుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈ త్రివణ గురుపీఠాన్ని ఏర్పాటు చేశాం. జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు, జ్యోతిష్య పరంగా సమస్యలు ఉన్నవారు మా దగ్గరకు వస్తే ఆ సమస్యలు దూరం చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం’ అని చెప్పారు.
ఓ కొత్త మార్గాన్ని చూపిస్తుంది
- Advertisement -
- Advertisement -