Wednesday, June 4, 2025
E-PAPER
Homeఆటలుశ్రేయస్ అయ్య‌ర్ అరుదైన ఘ‌న‌త‌

శ్రేయస్ అయ్య‌ర్ అరుదైన ఘ‌న‌త‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆదివారం అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌-2లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ)ను చిత్తు చేసి, ఫైన‌ల్‌కు చేరింది. దీంతో పంజాబ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చేసింది. దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత ఐపీఎల్ ఫైనల్‌లోకి ఆ జట్టు మరోసారి అడుగుపెట్టింది. ఈ విజయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ (87 నాటౌట్‌)తో కీల‌క పాత్ర పోషించాడు. చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిల‌బ‌డి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. 

ఈ విజ‌యంతో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ హిస్ట‌రీలోనే ఓ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఇప్పటి వరకు మూడు వేర్వేరు జట్లకు కెప్టెన్‌గా ఫైనల్‌కు చేర్చిన ఏకైక ఆటగాడిగా అయ్య‌ర్‌ నిలిచాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కు, 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)కు నాయకత్వం వహించిన శ్రేయస్, ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌ను టైటిల్ పోరుకు తీసుకొచ్చాడు. మెగా వేలంలో రూ. 26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి, త‌న‌పై పంజాబ్ యాజమాన్యం పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని శ్రేయ‌స్ నిల‌బెట్టుకున్నాడు.  న్యాయం చేసినట్లు ఈ విజయంతో స్పష్టమైంది.


కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ రికార్డులు ఇలా
2019: ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేఆఫ్స్)
2020: ఢిల్లీ క్యాపిటల్స్ (ఫైనల్)
2022: కోల్‌కతా నైట్ రైడర్స్ (7వ స్థానం)
2024: కోల్‌కతా నైట్ రైడర్స్ (ఛాంపియన్)
2025: పంజాబ్ కింగ్స్ (ఫైనల్)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -