- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో బుధవారం రెడ్డీస్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి ప్రారంభించారు. రెడ్డీస్ యూత్ సభ్యులతో కలిసి కొద్దిసేపు ప్రజలకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.రెడ్డీస్ యూత్ సభ్యులు గత 15 ఏళ్లుగా వినాయక నవరాత్రుల మహోత్సవంలో అన్నదాన సత్రం నిర్వహిస్తున్నారు. ఈయేడు కూడా పెద్ద ఎత్తున నిర్వహించిన అన్న సత్రంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు.ప్రతిసారి లాగే ఈసారి కూడా గ్రామ ప్రజలు సహకరించినందుకు రెడ్డీస్ యూత్ సభ్యులు ధన్యవాదములు.
- Advertisement -