నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలం పెంచికల్ పహాడ్ గ్రామంలో పాల ఉత్పత్తుల దారుల సంఘం నూతన చైర్మన్ గా సిలువేరు బిక్షపతిని ఎన్నికల అధికారి గోపె మహంకాళి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన డైరెక్టర్లుగా చిన్నం ముత్యాలు, చింతల సత్యనారాయణ, బాల్ద శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. సంఘాన్ని అభివృద్ధి దిశలో తీసుకు వెళ్లడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, సహకార సంఘం నుంచి లభించే సౌకర్యాలను పాడి రైతులకు సక్రమంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల సంఘం సభ్యులు బాల్ద రవి, చిన్నం సురేష్, సిలివేరు జంగయ్య, బాల్ద సిద్ధులు, సిలువేరు ఎల్లయ్య, గోపె మహేష్, గోపె ప్రభాకర్, సిలువేరు పాండు రమేష్, సిలువేరు మల్లయ్య, బాల్ద మహేష్ పాల్గొన్నారు.
పాలఉత్పత్తుల దారుల నూతన చైర్మన్ గా సిలువేరు భిక్షపతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES