Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు

ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
మండలంలోని జేపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ అమ్మవారి బోనాలు మంగళవారం ఘనం గా నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ గ్రామ దేవతల దేవాలయాలను అందంగా అలంకరించి దర్శించు కొని ప్రత్యేక పూజలు ని ర్వహించా రు. గ్రామంలో మహిళలందరూ ఉపవాసం ఉండి అమ్మవారిని దర్శించు కుని మొక్కులు తీర్చుకు న్నారు. ఈ సందర్భంగా సాయంత్రం మహిళలు, ఆడప డుచులు గ్రామ వీధుల్లో బోనాలు ఎత్తు కొని ఊరే గింపుగా బయలుదేరి డప్పుచ ప్పులతో నృత్యలు చేస్తూ దీప, దూపనై వేద్యాలు సమర్పించి, కోరిన కోర్కెలు తీర్చాలని అమ్మ వారికి మొక్కులు సమ ర్పించుకు న్నారు.

ఈ వేడుకల్లో భక్తులు, గ్రామప్రజలు, పలువురు నాయ కులు పెద్ద ఎత్తున పాల్గొని రేణుక ఎల్లమ్మ అమ్మవారికి భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండా లని అమ్మవారిని వేడుకున్నారు. అంతక ముందు గ్రామప్రజలు.. గ్రామదేవతలకు ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో గ్రామపెద్దలు, ప్రజ లు, చిన్నారులు, మహిళలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad