- Advertisement -
హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
దేశ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 ఏండ్లు అయిన సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వందేమాతరం గేయాలపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వందేమాతరం గేయాలపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు హాజరై, గీతాలాపన చేశారు. కార్యక్రమంలో ఏవో రాంరెడ్డి, సీపీఓ శ్రీనివాసాచారి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



