ఎనిమిది మంది సభ్యులతో ఏర్పాటు
రెండు టీవీ చానెళ్లు, ఏడు యూట్యూబ్ చానెళ్లపై కేసు నమోదు: డీజీపీ శివధర్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ సీసీఎస్ తోపాటు నారాయణ పేట జిల్లా మద్దూర్లో నమోదైన కేసులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎనిమిది మంది సభ్యులుం టారని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటోలను అసభ్యకరంగా పోస్ట్ చేసిన వ్యవ హారంలో తెలంగాణా పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూప్లో కావలి వెంకటేశ్పై కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదుపై ఈనెల 11న మద్దూర్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచే వార్తల ను ప్రసారం చేసిన వ్యవహరంలో సీసీఎస్లో కేసు నమోదైందని వివరిం చారు. రెండు తెలుగు న్యూస్ చానెళ్లు సహా ఏడు యూట్యూబ్ చానెళ్లపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. వారిపై 75, 78, 79, 351(1), 352(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని తెలిపారు. ఈ రెండు కేసుల్లో సిట్ దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. సిట్లో నార్త్ రేంజ్ జాయింట్ సీపీ శ్వేత, చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్ కుమార్, సీసీఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సీసీఐ సెల్ ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి, సైబర్ సెల్ ఎస్సై హరీశ్ సభ్యులుగా ఉన్నారని వివరించారు.
సజ్జనార్ నేతృత్వంలో సిట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



