- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : మేకల మండి కొరకు స్థలం అవసరం ఉన్నందున నిజామాబాద్ నుడా చైర్మన్ కేశవేణు, సంబంధిత శాఖ అధికారులు కలిసి శనివారం స్థల పరిశీలన చేశారు. స్థానిక కసబ్ గల్లీ వాసుల యొక్క హైమది మార్కెట్ లో గల మేకల మండి, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నందుకు గాను వారికి వేరే స్థలం ఇవ్వాలని వారు కోరారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆదేశానుసారం నుడా ఛైర్మెన్ కేశ వేణు, ఇన్చార్జ్ ఆర్డీవో వంతి, మున్సిపల్ ఆఫీసర్స్ స్థానిక ఎమ్మార్వో బాలరాజ్ లతో స్థల పరిశీలన చేశారు. వారి కుల పెద్దలతో ఈ స్థలం గురించి చర్చించారు.
- Advertisement -