- Advertisement -
నవతెలంగాణ – ముధోల్ : నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో భారత్ మిషన్ లో భాగంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలాన్ని కంటి దవాఖానా సమీపన 260సర్వే నంబర్ లో శనివారం ఎంపీడీవో శివకుమార్, మండల సర్వేయర్ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ నారాయణ రావు పటేల్ పరిశీలించారు. ఈ యూనిట్ కు 20 గుంటల స్థలం అవసరం ఉన్నదని వారు తెలిపారు. దీని కొరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 46 లక్షలు నిధులతో ఏర్పాటు చేయడం జరుగతుందని ఎంపీడీవో తెలిపారు. స్థల సేకరణ సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వారు పేర్కొన్నారు.
- Advertisement -